హరిత మిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న సహకారం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రామస్ ఉర్దు మీడియం స్కూల్లో చిల్డ్రన్ ఇస్లామిక్ అర్గానేజసన్ (CIO)వారి ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా హృదయం స్వచ్ఛంధ సేవా సంస్థ సహకారంతో ఈ యొక్క కార్యక్రమానికి మొక్కలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇషరత్ ఆరా మాట్లాడుతూ….మా సంస్థ ఆధ్వర్యంలో రాబోయే భావితరాల కోసం మేము మొక్కలు నాటాలని లక్ష్యం తో ఈ రోజు రామాస్ స్కూల్లో మొక్కలు నటమని అన్నారు.ఒకనాడు జనం తక్కువగా ఉండి చెట్లు ఎక్కువగా ఉంది ఆక్సిజన్ ఎక్కువగా వచ్చేదని తెలిపారు.రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించకుంటే స్కూల్ పిల్లలు బ్యాగులు ఎలా మొస్తున్నారో గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరిగే రోజులు దగ్గరలోనే ఉందన్నారు.అందుకే మా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నటుతున్నమని అన్నారు.మాకు సహకరించిన HM .S.వెంకటేశ్వరావు.ప్రజా హృదయం స్వచ్ఛంధ సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో CIO ఇంచార్జీ ఇఫాత్ పర్ హిన్.జమతే ఇస్లామీ భాద్యులు.ఆసియా ఖాతున్.హాబీబ.రూబ్న్ ఫాతిమా. ప్రైమరీ స్కూల్ HM నిషాత్ ఫాతిమా. టీచర్స్ యం న్ స్వామి. అజిమొద్దీన్.రజిమొద్దీన్.రాజు. ఉమా తదితరులు పాల్గొన్నారు.