మహబూబాబాద్ ఎస్ ఆర్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జనం కార్యక్రమం ఘనంగా జరిగింది. గణనాధునికి బై బై చెబుతూ నిమజ్జనం ఊరేగింపు ప్రారంభించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నవారు. మహిళలు పెద్ద సంఖ్యలో గణనాధునికి కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ నగర్ కాలనీ కమిటీ అధ్యక్షులు కల్లూరు ప్రభాకర్, సెక్రటరీ తీగల దుర్గేష్, కోశాధికారి పసునూరి విద్యాసాగర్, కాకి మనోహర్ రెడ్డి, తక్కెళ్ళపల్లి వీరభద్రం, రమేష్ శ్రీనివాస్ తదితర కమిటీ నాయకులు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
బై.. బై… గణేశా
05
Sep