మహా తెలంగాణ/మహబుబాబాద్ :
ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టిజిసిజిటిఏ) నూతన కార్యవర్గం ఎన్నికలను ఆదివారం కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (అటానమస్) హనుమకొండలో నిర్వహించినట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. చిన్న తెలిపారు. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ జి, వెంకయ్య, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మరిపెడ, కార్యదర్శిగా డాక్టర్ వి.శాంతి కుమార్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తొర్రూరు మరియు కోశాధికారిగా డాక్టర్ డి రాజశేఖర్, ఎన్ ఆర్ ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ ఎన్నికైనట్లుగా ప్రకటించడం జరిగింది.