నూకల రామచంద్ర రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు ”జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంను” ఆన్లైన్ మోడ్ లో ఐ క్యు ఏసి(IQAC) మరియు(Eco Club)ఎకొ క్లబ్ కోఆర్డినేటర్ జూపుడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహనకల్పించడంతోపాటు, ప్రతి వ్యక్తి ఇంధనాన్ని అవసరంమేరకు మాత్రమే ఉపయోగిస్తూ దుర్వినియోగం చేయకుండా ఇంధన వనరులను కాపాడుకోవాలని సూచించారు. అలాగే ఇంధన సామర్థ్యంలో దేశం సాధించిన విజయాలను గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల చేత ఇంధన వనరులను పరిరక్షిస్తామని దుబారాగా ఖర్చు చేయము అని ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ప్రతిజ్ఞ చేసిన విద్యార్థిని విద్యార్థులు my Gov app ద్వారా సర్టిఫికెట్లు పొందడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసులు ,అధ్యాపకులు డాక్టర్ మసూద్ ఏ అన్నపూర్ణ, డాక్టర్ బి వినోద్ కుమార్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ వి సాంబశివరావు , డాక్టర్ బి హతీరామ్,డాక్టర్ ఖాసీంషా, యం సుమన్, యం వీరు, డాక్టర్ కే సుమలత, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ పి ఉపేందర్, జె రవితేజ, ఓ ఉదయ్ కుమార్, ఎం నరేష్, జి యాకయ్య , డి ఎస్ రామన్న,విద్యార్థిని విద్యార్థులు జూమ్ యాప్ లో ఆన్లైన్ విధానంలో హాజరైనారు.
నూకల రామచంద్ర రెడ్డిప్రభుత్వ డిగ్రీ కళాశాలలోజాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
14
Dec