పేదల సంక్షేమానికి ఇందిరమ్మ ప్రజాపాలన

రాష్ట్రంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని గత ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూనే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు, మంగళవారం మహబూబాబాద్ మండలం పర్వతగిరి సోమ్లా తండ గ్రామపంచాయతీలో 100 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గిరిజన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దేవాదాయ అటవీ శాఖ మంత్రి సురేఖ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే మురళి నాయక్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ మహబూబాబాద్ నియోజకవర్గ సంక్షేమానికి 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని అందులో భాగంగా ఐదు కోట్ల రూపాయలతో 33 కేవి సబ్ స్టేషన్,బేతోల్ నుంచి సోమ్లా తండా వరకు 20 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం, జమాండ్లపల్లి నేషనల్ హైవే నుంచి 20 కోట రూపాయలతో బి టి రోడ్డు 5 కోట్ల రూపాయలతో సెంట్రల్ డ్రగ్ స్టోర్. గిరిజన అభివృద్ధి నిధుల నుంచి నేషనల్ హైవే నుంచి రాజలిపేట వరకు రోడ్డు ఏర్పాట్లు
సుమారు 50 కోట్ల రూపాయలతో కేసముద్రం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని తెలిపారు మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కొన్ని వినతులు అందించారు అందులో భాగంగా మానుకోటకు పట్టణం పైనుంచి వెళ్తున హై లెవెల్ విద్యుత్ లైన్లను తొలగించాలని, దానికి కోసం 7కోట్ల నిధులు అందించాలని మహబూబాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదవాని సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా 17 నెలల ప్రజా పాలనలో ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ను అందిస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామని 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఇవే కాకుండా రైతు సంక్షేమానికి పది 10 సంవత్సరాల పాలనలో గత బి ఆర్ ఎస్ పాలనా లో 15 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే మా ఇందిరమ్మా పాలనలో 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందని అన్నారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ మంటూ వేసామని గుర్తు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వ
ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో మొదటి విడత గా 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని, మహబూబాబాద్ లో 4 వేల ఇందిరమ్మా ఇండ్లు మంజూరు చేశామన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాన్ని దివాలా తీసింది కాక కేటీఆర్ మమ్మల్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *