2024 ,జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం లో భాగంగా 1: మొదటి త్రైమాసికంలో ANC కోసం నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీల శాతం 100%.
2: బ్లాక్లో లక్ష్యంగా ఉన్న జనాభాతో పోలిస్తే డయాబెటిస్ కోసం పరీక్షించబడిన వ్యక్తుల శాతం 100%
3: బ్లాక్లో లక్ష్యంగా ఉన్న జనాభాతో పోలిస్తే రక్తపోటు కోసం పరీక్షించబడిన వ్యక్తుల శాతం 100% 4: ఐసిడిఎస్ కార్యక్రమం కింద క్రమం తప్పకుండా అనుబంధ పోషకాహారం తీసుకుంటున్న గర్భిణీ స్త్రీల శాతం, ఆరోగ్య కార్డుల శాతం
6: బ్లాక్ మొత్తం SHG లకు వ్యతిరేకంగా రివాల్వింగ్ ఫండ్ పొందిన SHG ల శాతం, అగ్రికల్చర్ థీమ్స్, సోషల్ డెవలప్మెంట్ థీమ్స్ లలో జిల్లాలోని గంగారం మండలం ఆరు పారామీటర్లలో ఉత్తమ ప్రతిభ కనబరచి 5 సంతృప్తమైన సూచికలను సాదించినందులకు గాను రాష్ట్ర స్థాయిలో నీతి ఆయోగ్ సంస్థ సిల్వర్ మెడల్ ప్రకటించింది. అందుకుగాను “గౌరవ తెలంగాణ గవర్నర్ గారి అధ్యక్షతన సంపూర్ణ అభియాన్ సమ్మన్ సమరోహ్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవం ఆగష్టు 2 వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లోని ప్రజా దర్భార్ హాల్ లో జరుగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని అట్టి అవార్డును స్వీకరిస్తారు.