మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని భవాని నగర్ తండాలో ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సారాయి నిర్మూలనకై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాద్ టౌన్ పోలీస్ సిఐ జి.మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ జి.చిరంజీవి, ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిఐ సి.హెచ్. నీరజ, మరియు ఎస్ఐలు అశోక్, మౌనిక మరియు టౌన్ ఎస్సై షాకీర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సారాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కలిగించి, తండావాసులతో ప్రమాణం చేయించడం జరిగింది, ఇకమీదట ఎవరైనా సారాయి తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలపడం జరిగింది.
భవాని నగర్ తండాలో సారాయి నిర్మూలనకై అవగాహన కార్యక్రమం
06
Dec