5వ రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమం

పల్లె పల్లెన కాంగ్రెస్ జెండా ఎగరాలి

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

గ్రామ గ్రామన ఎమ్మెల్యే మురళి నాయక్ కు డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు

స్థానిక సంస్థలలో కాంగ్రెస్ నీ గెలిపించండి గ్రామాల అభివృద్ధి చేసుకోండి

మహబూబాబాద్ :

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్ , డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా కొనసాగుతుంది…ఈ రోజు నెల్లికుదురు మండలం లో వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షురాలు కోరారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి జరగలేదని కేవలం గత నాయకుల జేబులు నింపుకున్నారు కానీ అభివృద్ధి చేయలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పే పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ కేవలం చేతల పార్టీ అని అన్నారు.నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని కోరారు..సర్పంచ్ లను భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని అన్నారు.10 ఏళ్ల పాలనలో ఒక్క. రేషన్ కార్డు ఇయ్యకుండా ఒక్కరికి అయిన సన్న బియ్యం బువ్వ పెట్టకుండా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక విలువలు లేవని అన్నారు.. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత విద్య ,వైద్యంకి పెద్ద పీట వేశారు.ప్రజా ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలుగా అందుకుంటుంది పేదల సంక్షేమ కోసం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేస్తు అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్న మన ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు… ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *