మహా తెలంగాణ/హైదరాబాద్ :
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బస్వరాజ్ శ్రీనివాస్ ని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కోశాధికారి కొండపల్లి కేశవరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, వారి నియామకంపై హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించడం, విద్యార్థులకు విద్యా సహాయం, యువతకు ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, బ్రాహ్మణ వృత్తులు మరియు సంప్రదాయాలను పరిరక్షించడం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని అనేక మంది బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు.
అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, సులభంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని కేశవరావు కోరారు.
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా: శ్రీ బస్వరాజ్ శ్రీనివాస్
ఈ సందర్భంగా కేశవరావు కొండపల్లి ప్రస్తావించిన సమస్యలు మరియు సూచనలను బస్వరాజ్ శ్రీనివాస్ సానుకూలంగా స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సమాజ సంక్షేమానికి సంబంధించిన అంశాలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత వరకు వాటిని సాకారం చేసే విధంగా కృషి చేస్తానని శ్రీనివాస్ గారు తెలిపారు. అర్హులైన పేద బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత మరియు యువత అభివృద్ధికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మణ సమాజ సమస్యల పరిష్కారానికి చైర్మన్ శ్రీ బస్వరాజ్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం పట్ల కేశవరావు హర్షం వ్యక్తం చేశారు.