మహా తెలంగాణ/మరిపెడ:
విశాలాంధ్ర రిపోర్టర్,సీనియర్ జర్నలిస్టు పోతుల గోవర్ధన్ మాతృమూర్తి పోతుల కాంతమ్మ ఆదివారం మృతి చెందడం పట్ల సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోతుల కాంతమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలిపారు.ఈ విషాద సమయంలో సీనియర్ జర్నలిస్టు పోతుల గోవర్ధన్ కి,వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమలాకర్ పాల్గొని,పోతుల కాంతమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.