మెంచు అశోక్ కుమార్ జేఏసీ కన్వీనర్
మహా తెలంగాణ/మరిపెడ :
ఈనెల 21 వ తేదీన మహబూబాబాద్ పట్టణంలోని ఆర్తి గార్డెన్స్ లో డివిజన్ స్థాయిలో జరుగనున్న తెలం
గాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలి మరిపెడ జేఏసీ కన్వీనర్ మెంచు అశోక్ కుమార్
పిలుపునిచ్చారు. శనివారం మరిపెడ మండల కేంద్రంలోని ఉద్యమకారుల మండల బాధ్యులు బోడ రవి నాయక్, అప్సర్, బోడ రమేష్ నాయక్, వెంకట్ రెడ్డి, రాజేందర్, బోడ సురేష్, సలీమ్, జరిగిన సమావేశంలో
హాజరయ్యి తెలంగాణ అమరవీరుల బలిదానాలు స్మరిస్తూ నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జరుగనున్న
ఆత్మీయ సమావేశంలో ఉద్యమకారుల అభిప్రాయాలు తెలుసు కోవ
డానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
వస్తున్నారని, మరిపెడ మండలంలోని నిఖార్సైన తెలంగాణ ఉద్యమ
కారులు అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు