మహా తెలంగాణ/మహబూబాబాద్ :
వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ ( ఏఐటియుసి అనుబంధం) రేట్ల పెంపుకై నేడు ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి, అజయ్ సారధి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ రేషన్ డీలర్ల ప్రతినిధులు కంభం యాదగిరి వెంకటనారాయణ రేట్ల పెంపు కోసం నేడు స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా చర్చలు ఫలప్రదం అవ్వడం జరిగింది. క్వింట దిగుమతి కీ 10 రూపాయాల నుండి 13 రూపాయల 50 పైసలు పెరగడం జరిగింది ఈ సందర్భంగా కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు శ్రీను, బిక్షం రెడ్డీ, సురుగు వెంకన్న, సోమయ్య, రాము, వేను గోపాల్, హమాలీలు జక్కరయ్య, లక్మి నారయణ, నాగేశ్వర్ రావు, భూమయ్య, నర్సయ్య, వెంకన్న, పెరుగు కుమార్, తండ సందీప్, లింగ్య నాయక్ ,శ్యాంప్రసాద్, నీలం వెంకటేశ్వర్లు, యాకన్న పాల్గొన్నారు.